ఈ బ్లూ టీ తాగితే.. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయ్..!

Jyothi Gadda

03 October 2024

శుంఖుపుష్పాన్ని అపరాజిత, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలోనూ అంతే ప్రత్యేకంగానూ బావిస్తుంటారు. 

ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాల చికిత్సకు శంఖుపుష్పాన్ని వాడుతుంటారు. వీటితో చేసిన టీ తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ టీని ఎండిన శంఖుపుష్పాలతో తయారు చేస్తారు. ఈ టీ నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

శంఖుపుష్పం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్‌, కడుపుఉబ్బరం వంటి సమస్యలు నయం అవుతాయి.

ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే.. జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్‌ తొలగుతాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బరువు తగ్గేవారికి ఈ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శంఖుపువ్వుల టీలో కెఫిన్‌ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఉండవు

ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియ నుంచి ఆహార వ్యర్థాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి, అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. 

రోజూ శుంఖు పుష్పాల టీ తాగితే.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.