ఎలక్ట్రిక్ లేదా ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం తింటే ఏమవుతుందో తెల్సా

13 October 2024

Ravi Kiran

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రైస్ కుక్కర్ లో వండిన అన్నంలో పోషకాలు అస్సలు ఉండవని.. అంతేకాకుండా వంట చేసే సమయంలో అందులోనుంచి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయని చెబుతున్నారు.

రైస్ కుక్కర్ లో వండిన అన్నం తిన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కంటే ప్రెషర్ కుక్కర్ ఎంతో మేలని అంటున్నారు.

కరెంట్ కుక్కర్‌తో వండిన అన్నం కంటే.. మట్టి పాత్రలు, స్టీలు పాత్రలలో వండుకుని తినడం మంచిదని చెబుతున్నారు. మట్టి పాత్రలో వండుకుని తినడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచినిస్తాయన్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తయారీలో ఎక్కువగా అల్యూమినియం వాడుతుంటారు.. ఇందులో చేసిన ఆహారాలను తీసుకోవటం వల్ల ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు..

కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ప్రెషర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్‌లో వండటం సాధ్యమైనంత వరకు మానేయటమే ఉత్తమంగా చెబుతున్నారు. ఎక్కువ ప్రెష‌ర్‌లో అన్నం వండ‌టం వ‌ల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానిక‌ర‌ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశ‌న‌మైపోతాయి.