మాజికల్ థాయ్‌లాండ్ ఎక్స్ విశాఖపట్నం.. 

TV9 Telugu

06 July 2024

మాజికల్ థాయ్‌లాండ్ ఎక్స్ విశాఖపట్నం పేరుతో వైజాగ్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.

5 రాత్రులు, 6 రోజుల కొనసాగనున్న ఈ టూర్ ప్యాకేజీని వైజాగ్ నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది IRCTC సంస్థ.

ఈ ఏడాది సెప్టెంబర్ 7న ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్యాకేజీని ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు.

ఫస్ట్ డే విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి బ్యాకాంక్ కు ఫ్లైట్(Flight No. FD-117)లో చేరుకుంచారు.

రెండో రోజు పట్టాయాకు వెళ్లి లంచ్ తర్వాత విశ్రాంతి తీసుకొని 'నాంగ్ నూచ్ గార్డెన్ టూర్' పూర్తిచేసుకొని రాత్రి పట్టాయాలోనే ఉంటారు.

మూడో రోజు కోరల్ ఐలాండ్ టూరుకు చేసుకొని పట్టాయాకు వచ్చి నాల్గోవ రోజు సఫారీకి వెళ్తారు. తర్వాత బ్యాకాంక్ లో పలు ప్రాంతాలను సందర్శిస్తారు.

ఐదో రోజు హాఫ్ డే సిటీ టూర్ లో భాగంగా గోల్డెన్ బుద్దాను చూసి ఇండియన్ రెస్టారెంట్ లో లంచ్ చేసి తర్వాత శ్రీ రాచా టైగర్ జూకి వెళ్తారు.

ఆరో రోజు ఉదయం గ్రాండ్ ప్యాలెస్ చూసి లంచ్ తర్వాత సాయంత్రం 6 గంటలకు బ్యాకాంక్ నుంచి బయలుదేరి రాత్రి 10.20 గంటలకు విశాఖకు చేరుకుంటారు.

టికెట్ ధరలు సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 66735, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 57815, ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 57815గా నిర్ణయించారు.

https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. 8287932318, 9281495847, 8287932227 నంబర్ల ద్వారా సందేహాలు అడగవచ్చు.