ఈ టిప్స్ పాటించారంటే.. చలికాలంలో పాదాల పగుళ్లు మాయం..
Prudvi Battula
Images: Pinterest
24 November 2025
చలికాలంలో పగుళ్లు ఉన్న పాదాలకు మర్ధన చేయడం ద్వారా పాదాలకు రక్తప్రసరణ బాగా జరిగి, పాదాలు మృదువుగా తయారవుతాయి.
మర్ధన చేయడం
ఆరు టీస్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీస్పూన్ల గ్లిజరిన్, రెండు టీస్పూన్ల నిమ్మరసంను కలిపి మసాజ్ చేసుకోవాలి.
పెట్రోలియం జెల్లీ, నిమ్మరసం
వారానికి రెండుసార్లు మసాజ్ చేయడం వల్ల పాదాలు, మోచేతులు సాఫ్ట్గా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వారానికి రెండుసార్లు
పాదాల వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో గోరింటాకు పేస్ట్ లేదా హెన్నా పొడిని పేస్టులా చేసుకుని రాసుకోవాలి.
గోరింటాకు రాసుకోవాలి
పేస్టు పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో పాదాలను శుభ్రంగా కడుక్కుని టవల్తో తుడుచుకుంటే మెరుస్తుంటాయి.
చల్లటి నీటితో కడగాలి
మహిళలు కాళ్లకు పసుపు పూసుకోవడం వల్ల యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటివైరల్ నుంచి రక్షణ లభిస్తుంది.
పసుపు పూసుకోవాలి
ఉల్లిపాయ రసం కాలి వేళ్ళ మధ్య మర్ధన చేయడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుందని అంటున్నారు చర్మ ఆరోగ్య నిపుణులు.
ఉల్లిపాయ రసం
పుదీనా రసాన్ని పాదాలకు, కాలి వేళ్లకు పూసుకుని ఆరిన తర్వాత సాక్స్ ధరించడం వల్ల పాదాలకు పగుళ్లు రాకుండా ఉంటాయి.
పుదీనా రసం
మరిన్ని వెబ్ స్టోరీస్
రాత్రుళ్లు నిద్ర లేదా.? ఏ రాశి వారు ఏం చెయ్యాలంటే.?
బెస్ట్ సన్ రైజ్ చూడాలంటే.. ఆ ప్రదేశాలకు వెళ్లాల్సిందే..
ఈ టిప్స్ పాటిస్తే.. పసుపు రంగు క్లియర్.. మిల మిల మెరిసే దంతాలు..