TV9 Telugu

ట్రైన్​ జర్నీలో ఇబ్బందులా? ఈ నంబర్​కు కాల్​ చేస్తే వెంటనే పరిష్కారం..

13 Febraury 2024

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మందికి అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఫిర్యాదును నమోదు చేయడానికి రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్​ను ఏర్పాటు చేసింది.

'రైల్ మదద్' పేరుతో హెల్ప్ లైన్ నంబర్ 139ను ప్రారంభించింది. దీనికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడమే కాకుండా ఎస్​ఎమ్​ఎస్ పంపే సదుపాయం కూడా ఉంది.

భద్రత, వైద్య అత్యవసర పరిస్థితులు, రైలు ప్రమాదాలు, ఏదైనా ఇతర రైలు సంబంధిత, సాధారణ ఫిర్యాదులతో పాటు విజిలెన్స్ వంటి వాటిపైనా సమాచారం ఇవ్వొచ్చు.

దీంతో పాటు ఈ టోల్ ఫ్రీ నంబర్​పై ఫిర్యాదు చేసిన అంశంపై స్టేటస్ తెలుసుకునే సదుపాయం కూడా కలిపించింది రైల్వేశాఖ.

భద్రత, అత్యవసర వైద్య సేవల కోసం 1 నొక్కాలి. ఇది నేరుగా ఎగ్జిక్యూటివ్ కాల్ సెంటర్​కు కనెక్ట్ అవుతుంది.

రైలు ఎంక్వైరీల కోసం బటన్ 2 నొక్కాలి. ఇందులో సబ్ మెనూలో పీఎన్ఆర్ స్టేటస్, రైలు రాకపోకల సమాచారం తెలుసుకోవచ్చు.

ఛార్జీల విచారణ, టిక్కెట్ బుకింగ్, రద్దు, వేకప్ అలారం, గమ్యస్థాన హెచ్చరిక, వీల్ చైర్ బుకింగ్, భోజనం బుకింగ్ కోసం సబ్ మెనూలో ఉన్న 2 బటన్ వినియోగించాలి.

విజిలెన్స్ సంబంధిత సమస్యల కోసం 5 నొక్కాలి. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్​తో మాట్లాడేందుకు స్టార్ (*) బటన్ నొక్కాలి.