ఓయో బుకింగ్స్‌లో హైదరాబాదే టాప్‌.. తర్వాతి స్థానాల్లో ఈ నగరాలు..!

20 December 2023

TV9 Telugu

2023లో అత్యధికులు హోటల్‌ గదులు బుక్‌ చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయి.

హోటల్‌ గదుల బుకింగ్‌లో తెలంగాణా రాష్ట్రంలో వరంగల్‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు టాప్‌లో ఉన్నాయి.

అత్యధిక మంది గదులు బుక్‌ చేసుకున్న నగరంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.

కర్ణాటక రాజధాని బెంగళూరు, దేశ రాజదాని దిల్లీ, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

గతేడాదితో పోలిస్తే చిన్న పట్టణాలైన గోరఖ్‌పూర్‌, దిఘా, వరంగల్‌, గుంటూరులో అత్యధిక బుకింగ్‌లు కనిపించాయి.

విశ్రాంతి కోసం ఎంచుకున్న గమ్యస్థానాల్లో జైపూర్ ముందు నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో గోవా, మైసూరు, పుదుచ్చేరి ఉన్నాయి.

ఆధ్యాత్మిక గమ్యస్థానాల బుకింగ్‌ల్లో పూరీ ముందుండగా.. అమృత్‌సర్‌, వారణాసి, హరిద్వార్‌ ఆ తర్వాత నిలిచాయి. దేవ్‌ఘర్‌, పళని, గోవర్ధన్‌ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలకూ ఆకర్షణ కనిపించింది.

ఎక్కువ బుకింగ్‌లు దక్కించుకున్న రోజుగా 2023 సెప్టెంబరు 30 నమోదైంది. 2023 మే అత్యధిక బుకింగ్‌లు నమోదైన నెలగా ఉంది.