ఖజురహో ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది..?

25 December 2023

TV9 Telugu

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛతర్‌పూర్ జిల్లాలో ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో ఆలయ సుముదాయాన్ని నిర్మించారు.

చండేలా పాలకులు నిర్మించన ఖజురహో దేవాలయాల సమూహం దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి.

వాస్తవానికి అప్పట్లో ఇక్కడ మొత్తం 85 దేవాలయాలు నిర్మించారు. అయితే ప్రస్తుతం వాటిలో 23 మాత్రమే మిగిలాయి.

ఇది శృంగారభరితమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ వాటి నిర్మాణాలు చుస్తే ఎవరినైనా ఇట్టే అబ్బురపరుస్తాయి.

ఈ ఆలయ గోడలపై 10% శిల్పాలు మాత్రమే లైంగిక కార్యకలాపాలను వర్ణిస్తాయి. మిగిలిన 90% శిల్పాలు ఆనాటి ప్రజల జీవితాన్ని వర్ణిస్తాయి .

ఖజురహో ఆలయాల్లో చాలా క్లిష్టమైన డిజైన్ కలిగిన, అందంగా చెక్కిన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడి అందమైన పెయింటింగ్స్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి .

మొదటి దాంట్లో బ్రహ్మ దేవుడి శిల్పాలు, రెండో దాంట్లో శివుని శిల్పాలు, మూడో దాంట్లో విష్ణు శిల్పాలు తీర్చిదిద్దారు.

ఈ ఆలయం పేరు ఖజూర్ అనే హిందీ పదం నుండి తీసుకోడం జరిగింది. ఒకప్పుడు ఈ నగరం చుట్టూ ఖర్జూరం మాత్రమే ఉండేది. అందుకే దీనికి ఖజురహో అని పేరు వచ్చింది.

ఖర్జూరం అంటే మహాశివుని సంకేత నామం. ఇది కాకుండా దాని పేరు ఖజురా-క్యారియర్ నుండి వచ్చిందని చెబుతుంటారు.