చేపలో ఈ పార్ట్‌ని అస్సలు వదలకండి.. 

Narender Vaitla

17 September 2024

చేప గుడ్లలో విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుఉన మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చేప గుడ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ పెరుగుతుంది. రక్తం శుద్ధి కాడంతో పాటు, రక్తహీనతతో బాధపడేవారికి దివ్యౌషధంలా ప‌నిచేస్తాయి.

ఇక చేప గుడ్లలో విటమిన్‌ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను బలంగా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

చేప గుడ్లను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు గుండే ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. 

భవిష్యత్తులో అల్జీమర్స్‌ రాకుండా ఉండాలంటే చేప గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మతిమరపు స‌మ‌స్య కూడా దరిచేరకుండా ఉంటుంది.

బీపీతో బాధపడేవారికి కూడా చేప గుడ్లు బాగా ఉపయోగపడతాయని నిపుణుల చెబుతున్నారు. క్రమంతప్పకుండా వీటిని తీసుకుంటే బీపీ తగ్గుముఖం పడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.