TV9 Telugu

8 April 2024

చింత గింజలు  వేయించుకొని తింటే.. 

చింత గింజలను తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ కడుపు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

మెరుగైన రక్త ప్రసరణకు కూడా చింత గింజలు ఉపయోగపడతాయి. ఇందులోని గుణాలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికీ, పెరుగుదలకీ ఉపయోగపడతాయి.

చింత గింజల్లోని ఫైబర్‌ కంటెంట్‌ బరువు తగ్గడంలోనూ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ భోజం చేసిన తర్వాత రెండు గింజలను తింటే ఫలితం ఉంటుంది. 

చింత గింజల్లో విటమిన్‌ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని గుణాలు ఇన్‌ఫెక్షన్స్‌ను దరిచేరనివ్వదు. 

ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్లనొప్పులను నయం చేయడంలో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతీ రోజూ చింత గింజలను తీసుకోవాలి.

చింత గింజల్లో విటమిన్‌ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

చింత గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దీంతో మధుమేహం సమస్య బారిన పడకుండా చూసుకోవచ్చు. షుగర్‌ ఉన్న వారికి కూడా ఇది దివ్యౌషధంగా చెప్పొచ్చు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.