మరణం లేని ఈ చెట్టు పండ్లు తింటే ఏమౌతుందో తెలుసా..?

Jyothi Gadda

15 October 2024

మర్రి చెట్టు నీడను ఇవ్వడమే కాదు...ఈ చెట్టులోని ప్రతి భాగం ఎన్నో ఔషధ విలువలతో నిండివుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

మర్రి పాలు, ఆకులు, చెక్క, విత్తనాలు, వేళ్లు, కొమ్మలు వీటన్నింటిలోనూ అనేక రోగాలను నయం చేయగల అద్భుత శక్తి దాగివుందని చెబుతున్నారు. మర్రిపండ్లతో లాభాలు చూద్దాం..

మర్రి చెట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మర్రిపండ్లను ఎండబెట్టి పొడి చేసుకుని పంచదారతో కలుపుకుని తింటే పైల్స్ వ్యాధికి చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

మర్రిచెట్టు చెక్కలు, పండ్లతో తయారు చేసిన సబ్బులను ఉపయోగిస్తే చర్మం మెరిసిపోతుంది. అంతేకాదు మర్రిపండు నొప్పులను కూడా తగ్గిస్తుంది.

మహిళల్లో వచ్చే నెలసరి సమస్యలకు మర్రిపండ్లు చెక్ పెడతాయి. పంటినొప్పి వస్తే ఈ పండ్లను లవంగాలను నోట్లో ఉంచుకుంటే ఉపశమనం ఉంటుంది. 

మర్రిచెట్టు చెక్కను ఎండబెట్టి పొడి కొట్టి అందులో వెన్నను కలిపి రోజూ 2పూటల నాలుగు గ్రాముల మేర పాలతో కలిపి తీసుకుంటే గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి.

మర్రిచెట్టు చెక్కతో తయారు చేసిన పౌడర్ తో పళ్లు తోముకుంటే దంతాలు, చిగుళ్లు బలంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మర్రిపండ్లను తింటే రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. మర్రిపండ్లలో పీచు, విటమిన్ బి2, సి, సియాసిన్, ఐరన్, కాల్షియం అధికమోతాదులో ఉంటాయి.