మిగిలిన ఆహారంతో మొక్కలకు మేలు.. 

TV9 Telugu

28 July 2024

అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయి.

మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలని నిపుణులు చెబుతున్నారు.

మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేం. ఈ పుల్లటి మజ్జిగను బకెట్‌ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి.

మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్‌ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోస్తే బాగా పెరుగుతాయి.

బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్‌లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిదని నిపుణుల మాట.

ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి.

ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలు నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్‌లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి.

చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్‌ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి.