ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం..!

Jyothi Gadda

30 September 2024

మీరు కూడా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్టయితే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీవెంటే ఉంటుంది.

జీవితం ఆనందంగా గడిపేందుకు అవసరమయ్యే అన్ని పరిహారాలు వాస్తు శాస్త్రంలో వివరంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని వస్తువులను ఇంట్లో ఈ విధంగా అలంకరించుకోవాలంటున్నారు. 

పిరమిడ్ వాస్తు ప్రకారం ఇంట్లో వెండి, ఇత్తడి లేదా రాగితో తయారుచేసిన పిరమిడ్లను కలిగి ఉండడం వల్ల సంపద పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పిరమిడ్ ను  ఈశాన్యం మూలలో ఉంచాలి. 

ఇంట్లో తూర్పువైపున మట్టి కుండ లేదా తొట్టి ఏర్పాటు చేసుకుని అందులో నీళ్లు నింపి ఉంచుకోవాలి. ఈ పరిహారం ద్వారా ఇంట్లో సంపద, ఆనందం వెల్లివిరుస్తాయి.

ఇంట్లో లోహపు తాబేలు బొమ్మ ఉత్తరం వైపు ముఖం చేసి ఉండేలా అమర్చుకోవాలి. ఇలా అమర్చిన తాబేలు ఇంట్లోకి సంపద, సమృద్ధి, సంతోషాన్ని తెస్తుందని వాస్తు చెబుతోంది.

నల్లని గుర్రపు డెక్కను ఇంటి ప్రధాన ద్వారానికి బిగించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఇది ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరకుండా నిరోధిస్తుంది. ఇంట్లో ఆర్థిక ప్రతిష్టంభన లేకుండా చేస్తుంది.

ఇంట్లో లోహపు చేప ప్రతిమ ఉంటే అదృష్టం కలిసి వస్తుందట. ఆర్థిక లోటు లేకుండా ఉండేందుకు ఈ లోహపు చేప ప్రతిమ తోడ్పడుతుంది. ఇంట్లో సంతోషాలు నిలిచి ఉండేలా చేస్తుంది.

పద్మంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాన్ని పూజ గదిలో, పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటం ఇంట్లో ఉండడం వల్ల అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.