రాత్రి సమయంలో పొరపాటున కూడా వీటిని తినొద్దు.. ప్రమాదకరం

28 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

డిన్నర్‌లో ఇష్టమైన భోజనం తినడం ఎవరికైనా మంచి అనుభూతిని కలిగిస్తుంది. అయితే మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లేనిదే అస్సలు తినలేం అంటారు కొందరు 

ఆరోగ్యానికి పౌష్టికాహారం తీసుకోవడం పై దృష్టి పెట్టాలి. శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేసే ఆహారాన్ని మాత్రమే తినడం అవసరం.

ముఖ్యంగా బరువును అదుపులో ఉంచే ఆహారాలను తినాలి. కనుక రాత్రి సమయంలో ఏది బడితే అది తినే అలవాటుని మానుకోండి. దీంతో జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

రాత్రి భోజనం తర్వాత చాక్లెట్ లేదా ఐస్ క్రీం తినవద్దు. ఇవి ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని తినడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతుంది.

అర్థరాత్రి పని చేయడానికి కాఫీ , టీలను తాగే అలవాటు ఉంటె మానుకోండి. ఇందులో కెఫిన్ ఉంటుంది. దీంతో నిద్రలేమి, డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.

రాత్రి భోజనంలో పచ్చి ఉల్లిపాయలు తినకూడదు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. గ్యాస్‌తో కడుపు ఉబ్బిపోయి ఇబ్బంది పడొచ్చు.

రాత్రి భోజనంతో స్వీట్లు తినొద్దు. రాత్రి భోజనంలో చక్కెరతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండండి. అదనపు ఉప్పుతో ఉన్న ఆహారం జీవక్రియ మందగించేలా చేస్తుంది. కడుపు సమస్యలను కూడా పెంచుతుంది.