ఈ సమస్యలన్నవారికి చియా సీడ్స్ హానికరం.. ఎందుకంటే  

 21 July 2024

TV9 Telugu

Pic credit - pexels

చాలా మంది బరువు తగ్గడానికి చియా విత్తనాలపై ఆధారపడతారు. చియా గింజలు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడతాయి.

బరువు తగ్గడానికి 

అయితే చియా సీడ్స్ తినడం అందరి ఆరోగ్యానికి మంచిది కాదు. చియా విత్తనాలు ఎవరికి హానికరమో తెలుసుకోండి.

కొందరికి హానికరం  

నువ్వులు, ఆవాలు అలర్జీ ఉన్నవారు చియా గింజలను తినకూడదు. ఈ గింజలో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా మందికి చర్మం దురద , వాపు వంటి అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. 

అలర్జీ ఉన్నవారు

అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా చియా విత్తనాలను తినకూడదు. హై బీపీ సమస్యకు మందు వేసుకునేటప్పుడు చియా సీడ్స్ తినకపోవడమే మంచిది.

హై బీపీ 

చియా గింజల్లో ఉన్న ఒమేగా 3 రక్తాన్ని పల్చగా మారుస్తుంది. కనుక రక్త స్రావ సమస్యలు ఉన్నవారుయాంటీ ప్లేట్‌లెట్ మందులు తీసుకునేవారు కూడా చియా విత్తనాలకు దూరంగా ఉండాలి.

రక్త స్రావ సమస్యలు

చాలామంది కడుపు సంబధిత సమస్యలతో బాధపడుతున్నారు. అధిక ఆమ్లత్వం ఉన్నవారు చియా విత్తనాలకు దూరంగా ఉండడం మేలు.

అధిక ఆమ్లత్వం 

రక్తంలో చక్కెరను నియంత్రించడానికి చాలా మంది ప్రతిరోజూ మందులు తీసుకుంటారు. ఈ ఔషధాన్ని తీసుకునేటప్పుడు చియా విత్తనాలను తీసుకోకూడదు.

 షుగర్ పేషెంట్స్ 

గర్భిణీ స్త్రీలు చియా సీడ్స్ తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

గర్భిణీ స్త్రీలు