గింజలు, పొట్టు లేని పండు ఏదో తెలుసా..?

TV9 Telugu

10 April 2024

కొన్ని పండ్లను తొక్కతో తింటారు. కొన్ని పండ్లను పొట్టు లేకుండా తింటారు. అయితే గింజలు, పొట్టు లేని పండు ఉందని మీకు తెలుసా .

అవును, మల్బరీ అనేది విత్తనాలు లేదా పొట్టు లేని పండు.మల్బరీ పండ్లు తినడానికి కాస్త పులుపు, తీపిగా ఎంతో రుచికరంగా ఉంటాయి.

ఎంతో రుచికరంగా ఉండే మల్బరి పండ్లలో అనేక పోషకాలతో పాటు ఎన్నో రకాల ఔషద గుణాలు ఉన్నానంటున్నరు నిపుణులు.

విటమిన్ C తో పాటుగా ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్లు, ఆల్కలాయిడ్లు,కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలం.

మల్బరీ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది . మల్బరీ మానవ కాలేయాన్ని కూడా బలపరుస్తుంది.

క్యాన్సర్ రోగులకు మల్బరీ పండు ఒక వరం. దీన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు నశిస్తాయి. ఉపశమనం కలుగుతుంది.

మల్బరీ పండ్లు తినడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. రెస్వెరట్రాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌ అధికంగ లభిస్తుంది.

మల్బరీ పండులో విటమిన్‌ A, విటమిన్‌ E, ల్యూటిన్‌, బీటా-కెరోటిన్‌ వంటి కెరోటినాయిడ్‌ వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.