రోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే.. ఆ వ్యాధి ఉన్నవారికి బ్రహ్మాస్త్రం

Ravi Kiran

14 Aug 2024

ఉసిరిని పోషకాల గని అంటారు. ఉసిరికాయల్లో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి.. దీంతోపాటు దీనిని విటమిన్ సి పవర్ హౌస్‌గా పేర్కొంటారు.

ఉసిరి రుచి పుల్లగా వగరుగా ఉన్నప్పటికీ.. ఇది అద్భుతమైనది.. అయితే.. ఉసిరి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

వాస్తవానికి మధుమేహాన్ని పూర్తిగా నిర్మూలించలేము. కానీ.. మధుమేహాన్ని మందులతో అదుపులో ఉంచుకోవచ్చు. 

కొన్ని సహజ పదార్థాలను ఉపయోగించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని పూర్తిగా నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుంది.

వాటిలో ఒకటి ఉసిరి.. ఉసిరిలో ఉండే పోషకాలు డయాబెటిస్ లో మేలు చేస్తాయి. ఇవి రక్తంలో చక్కరను అదుపులో ఉంచుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఉసిరిలో ఐరన్, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, ఫైబర్, క్యాల్షియం, ప్రొటీన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.

ఉసిరికాయలో క్రోమియం అనే ఖనిజం ఉంది.. ఇది గ్లూకోజ్, రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

ముందుగా ఒక పాత్రలో 2 కప్పుల నీరు తీసుకుని బాగా మరిగించాలి. అందులో ఒక చెంచా ఉసిరి పొడి , అల్లం పొడి వేసి కలపండి. తాజా పుదీనా ఆకులను వేసి కొన్ని నిమిషాలు మరిగించి టీని వడకట్టి త్రాగాలి.

డయాబెటిక్ తో బాధపడుతున్న వారికి ఉసిరి టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరికాయను తినడం, రాళ్ల ఉప్పు కలిపి, చట్నీలా చేసి తినడం లేదా రసం తాగడం కూడా మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.