పెళ్ళై సంవత్సరాలు గడిచిన పిల్లలు పుట్టడం లేదా ?? కారణాలు ఇవే
Phani CH
07 May 2025
Credit: Instagram
ప్రస్తుతం ఉన్న ఆధునిక జీవన శైలి కారణంగా పెళ్ళైన తరువాత దంపతుల్లో పిల్లలు కనడం కోసం అనేక ఇబ్బంది బాధపడుతున్నారు.
ఈ సమస్యను ఇన్ఫెర్టిలిటీ లేదా సంతానలేమి అంటారు. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో 10 నుంచి 15 శాతం వరకూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది.
అయితే సంతానలేమి సమస్యకు ప్రధాన కారణాలేంటో ఇప్పడు తెలుసుకుందాం. వయస్సు పెరిగిన కొద్దీ మహిళల్లో గర్భధారణ సామర్థ్యం తగ్గుతుంది.
35 ఏళ్ల తర్వాత తరువాత నుండి మహిళల్లో గుడ్లు విడుదల తగ్గుతుంది. అలానే పురుషులలో స్పెర్మ్ కౌంట్, నాణ్యత తగ్గుతుంది. ఇది సంతానలేమికి దారితీస్తుంది.
ఈ మధ్య కాలంలో మహిళలు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీసి గర్భసంచిలో చిన్న చిన్న సిస్టులు ఏర్పడి, అండం విడుదలలో ఆటంకం కలుగుతుంది.
పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం ఒక సమస్య అయితే శుక్రకణాలు సరిగ్గా కదలలేకపోతే అండాన్ని చేరుకోలేకపోవడం కూడా సంతానలేమి సమస్య ఏర్పడవచ్చు.
పురుషుల్లో మధుమేహం ఉన్న లేదా శస్త్రచికిత్సల వల్ల శుక్రకణాలు పురుషాంగం ద్వారా బయటకు రాకుండా మూత్రాశయంలోకి వెనక్కి వెళ్లడం వల్ల కూడా సంతానలేమి సమస్య ఏర్పడవచ్చు
ధూమపానం మరియు మద్యపానం శుక్రకణాలు మరియు అండాల నాణ్యతను తగ్గిస్తాయి. అధిక బరువు, అధిక ఒత్తిడి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది, ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.