142 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. మీరు డబ్బుల మూటల్లో పడినట్టే..!

Jyothi Gadda

14 October 2024

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేక శుభయోగాలను, అశుభయోగాలను ఏర్పరుస్తాయి. ఈ అక్టోబర్ మాసంలో వివిధ గ్రహాల సంచారం కారణంగా ఏర్పడే యోగాలు ఇలా ఉన్నాయి.

అక్టోబర్ 16న అత్యంత అరుదైన యోగం ఏర్పడనుంది. ఈ రోజున శని, రాహువు, శుక్రుడు, బుధుడు ఒకే సరళ రేఖ మీదికి వస్తున్నారు. దాదాపుగా 142 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుంది.

దీని ప్రభావం 12 రాశులపై కూడా ఉంటుంది. కొన్ని రాశులకు ఇది శుభయోగాల్ని కల్గజేస్తుండగా.. మరికొన్ని రాశుల వారికి మాత్రం మధ్యమ, కొన్ని రాశుల వారికి సాధారణ ఫలితాలనిస్తుంది.

మేషం: ఈ రాశివారికి  ఆకస్మిక ధనలాభం సూచనలు కన్పిస్తున్నాయి. విందులు వినోదాల్లొ పాల్గొంటారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీరి జీవితం సాఫీగా సాగిపోతుంది. 

తుల: ఈ రాశి వారికి ఈ యోగం వల్ల కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. రాదనుకున్న డబ్బులు చేతికి అందుతాయి. నచ్చిన యువతితో పెళ్లి కుదురుతుంది. 

మీనం: ఈ రాశి వారికి ఈ యోగం వల్ల విదేశీయానానికి అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. లాటరీలు తగిలే అవకాశం ఉంది. ఇది మీజీవితంలో శుభసమయం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాన్ని నిర్ధారిస్తుంది. గ్రహాల రారాజు అయిన సూర్యుడికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 

అక్టోబర్ 17వ తేదీన తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తులా రాశిలో సూర్య సంచారం కారణంగా ఐదు రాశుల వారి జీవితం మారిపోతుంది. వారికి ఊహించని సంపదతో పాటు అదృష్టం కలిసి వస్తుంది.