ఏడాదిలో ‘రెండు సార్లు’ బోర్డు పరీక్షలు .. ఒత్తిడిని దూరం చేసేందుకే..

10 October 2023

విద్యార్థుల శారీరిక మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పది నుంచి 12 వరకు పరిక్షల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.

2024 నుంచి ఏటా రెండుసార్లు జరగనున్న పది, 12వ తరగతి బోర్డు పరీక్షలు విద్యార్థుల క్షమాం కోసం ఈ నిర్ణయం.

అయితే ఈ రెండింటికీ హాజరుకావడం తప్పనిసరి కాదని ఎదో ఒక దానికి హాజరైతే చాలు అని తెలిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.

తీవ్ర ఒత్తిడిని తగ్గించేందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.

వచ్చే ఏడాది 2024 నుంచే అన్ని రాష్ట్రాల్లో ఈ కొత్త విధానం అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది కేంద్ర ప్రభుత్యం.

ఒక వేళ తొలి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినట్లు భావిస్తే.. తర్వాతి పరీక్షకు హాజరవ్వాల్సిన అవసరం లేదు.

విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది ద సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీఏబీఈ)

నేటి విద్యా వ్యవస్థ డిమాండ్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సీఏబీఈ సంస్థని పునర్నిర్మించే అవకాశం ఉంది.