సీతాఫలం అతిగా తింటున్నారా.? అనారోగ్యాన్ని పక్కన పెట్టుకున్నట్టే..
Prudvi Battula
Images: Pinterest
15 November 2025
అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఏదైనా అతిగా తింటే అనర్థానికి దారి తీస్తుంది. సీతాఫలం ఎక్కువగా తింటే కొందరిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
సీతాఫలం
అలాగే రక్తపోటు, డయాబెటిస్ సమస్యలున్న వారు ఈ పండును మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి సీతాఫలంతో కలిగే దుష్ప్రభవాలేంటో తెలుసుకుందాం రండి.
రక్తపోటు, డయాబెటిస్
చాలా మందికి సీతాఫలం తినడం వల్ల ఒక్కోసారి దురద, దద్దుర్లు వంటి సమస్యలుతలెత్తవచ్చు.ఇలాంటి సమస్యలున్నవారు సీతాఫలం పండును తీసుకోకపోవడమే మంచిది.
దురద, దద్దుర్లు
జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినకూడదు. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉన్న కారణంగా కడుపునొప్పి, విరేచనాలు, గ్యాస్ సమస్యలు వస్తాయి.
కడుపు నొప్పి, విరేచనాలు, గ్యాస్
సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉన్నందున ఎక్కువగా తినకూడదు. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.
వాంతులు, వికారం
రక్తపోటు ఉన్నవారు సీతాఫలాలను మితంగా తినాలి. దీనిలోని గుణాలు అకస్మాత్తుగా రక్తపోటును తగ్గిస్తాయి. మైకం, మూర్ఛ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
మైకం, మూర్ఛ, డీహైడ్రేషన్
పుష్కలంగా ఉన్న క్యాలరీలు కారణంగా సీతాఫలంలో ఎక్కువగా తింటే బరువు పెరగవచ్చు. ఈ పండులో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది కూడా బరువును పెంచుతుంది.
బరువు పెరగవచ్చు
సీతాఫలం గింజలు చర్మంపై, ముఖ్యంగా కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి పొడి వల్ల కొందరికీ దద్దుర్లు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.
కళ్లకు హాని
మరిన్ని వెబ్ స్టోరీస్
7 డేస్.. 7 జ్యువెలరీ.. ఏ రోజు ఎలాంటి నగలు ధరించాలంటే.?
ఇంట్లో అందరు మెచ్చేలా.. టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఎలా చెయ్యాలంటే.?
కాటేసే ముందు పాములు హెచ్చరిస్తాయా.?