14 June 2024
TV9 Telugu
Pic credit - getty
ఉప్పులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
మీరు స్నానం చేసే నీటిలో ఒక చెంచా ఉప్పు వేస్తే, మీరు దాని నుండి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రోజు ఉప్పు కలిపిన నీటి ప్రయోజలు తెలుసుకుందాం..
స్నానం చేసే నీటిలో ఉప్పు కలపడం వల్ల శరీరంలోని మచ్చలు తొలగిపోతాయి. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా మచ్చలు, స్కిన్ వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఉప్పులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ స్కిన్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచడానికి మీరు స్నానపు నీటిలో ఉప్పు కలిపి కూడా స్నానం చేయవచ్చు. దీనితో పాటు అనేక సీజనల్ వ్యాధుల నుండి రక్షించబడతారు.
ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఏదైనా కారణం వల్ల ఒత్తిడికి గురైతే రోజూ రాత్రి పడుకునే ముందు ఉప్పు నీటితో స్నానం చేయండి.
నీళ్లలో ఉప్పు వేసి స్నానం చేయడం శరీరంలోని కాల్షియం లోపం తగ్గుతుంది. రుమాటిజం లేదా ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం కోసం నీటిలో ఉప్పు కలిపి స్నానం చేయడం చాలా ఉపయోగం.
రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత బలహీనంగా అనిపిస్తుంది. ఉప్పు నీళ్లలో స్నానం చేస్తే అలసట వెంటనే పోతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగి చురుకుగా ఉండేలా చేస్తుంది.