రిషికేశ్‌లోని ఈ ప్రాంతాల్లో అన్ని ఉచితం..

21 December 2023

TV9 Telugu

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి.

అనేక పవిత్ర నదుల సంగమం కలిగిన ఏకైక ప్రదేశం. ప్రశాంతతకు, అందమై ప్రకృతితోపాటు మనోహరమైన దృశ్యాలతో కూడిన ప్రాంతం.

మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతికి నిలయం రిషికేశ్‌. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటుంది.

ప్రతి సంవత్సరం లక్షల మంది ఇక్కడికి చేరుకుంటారు. కొంతమంది మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇక్కడికి వెళతారు.

నిత్యం పర్యాటకులు, భక్తుల రద్దీతో హడావిడిగా ఉంటుంది. ఈ రిషికేశ్ చుట్టూ అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

ఆధ్యాత్మిక కేంద్రం రిషికేశ్‌లో మీరు ఉచితంగా, చాలా తక్కువ డబ్బు ఖర్చు చేసి బస చేసే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి.

ఇక్కడ మీకు అన్ని రకాల ఆహార సదుపాయాలు కూడా లభిస్తాయి. రిషికేశ్‌లో కేవలం 100-200 రూపాయలకే బస చేయగల అనేక ఆశ్రమాలు ఉన్నాయి.

పరమార్థ నికేతన్ ఆశ్రమం, భారత్ హెరిటేజ్ సర్వీస్, గీతా భవన్ ఆశ్రమం ఉచిత సదుపాయలను కూడా కల్పిస్తున్నాయి.