విశాఖపట్నం చరిత్రలో అపూర్వ ఘట్టాలు..

TV9 Telugu

27 April 2024

260 B.C.లో అశోకుడు కళింగ మహా సామ్రాజ్యాన్ని జయించిన సమయంలో విశాఖపట్నం కూడా ఇందులో ఓ భాగంగా ఉందని చరిత్ర చెబుతుంది.

208 B.C.లో గౌతమిపుత్ర శాతకర్ణి ముత్తాత అయినా చంద్ర శ్రీ శాతకర్ణి విశాఖపట్నం ప్రాంతాన్నీ పరిపాలించాడు.

220 A.D పల్లవులు యుద్ధం చేసి ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించారు.

1000 నుంచి 1200 A.D వరకు విశాఖపట్నం తమిళనాడుకు చెందిన తంజోర్ చోళుల పాలనలలో ఉందని ప్రాంత చరిత్ర చెబుతుంది.

1200 A.D నుంచి గంగాలు ఈ ప్రాంతనికి పాలకులుగా ఉన్నారు. 1500 ADలో గంగాల నుంచి గజపతులు ఈ ప్రాంతిన్ని స్వాధీనం చేసుకున్నారు.

గజపతులు విజయనగరం రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో సింహాచలం శ్రీ వరాహ నరసింహస్వామి దేవాలయ నిర్మాణం జరిగింది.

17వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే "విజగపట్నం"గా ఈ ప్రాంతాన్ని పిలిస్తు ఫ్యాక్టరీ స్థాపించబడింది.

1922 నుంచి 1924 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేస్తూ ఈ ప్రాంత మన్యంలో వీరమరణం పొందారు.

1947న తూర్పు నౌకాదళ కమాండ్ విశాఖపట్నంలో తన స్థావరాన్ని స్థాపించింది. 1947కి ముందు ఇక్కడ రాయల్ నేవీ ఉండేది.