వామ్మో..! టాయిలెట్ పేపర్ ధర అన్ని లక్షలా..!

TV9 Telugu

29 June 2024

ప్రపంచంలో చాలామంది ప్రజలు ప్రతిరోజూ ఉపయోగించే అనేక వస్తువులు ఉన్నాయి. ఇందులో టాయిలెట్ పేపర్ కూడా ఉంటుంది.

లక్షల విలువ చేసే టాయిలెట్ పేపర్ ఒకటి ఉందని మీకు తెలుసా ? అది ఎందుకు అంత ఖరీదైనదో తెలుసుకుందాం రండి..

ఏదైనా టాయిలెట్ పేపర్ ధర సాధారణంగా రూ.100 నుంచి రూ.500 వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఎక్కడ కూడా ఉండదు.

నిజానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్ పేపర్ బంగారంతో తయారు చేయడం జరిగింది. అందుకే ధర లక్షల్లో ఉంది.

ఆస్ట్రేలియాకు చెందిన టాయిలెట్ పేపర్ మ్యాన్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది.  దినిలో కంపెనీ 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించింది .

స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ టాయిలెట్ పేపర్ ధరను మ్యాన్ కంపెనీ అక్షరాల రూ.10,75,45,750గా నిర్ణయించింది.

మ్యాన్ కంపెనీ ప్రకారం, 22 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ 3 ప్లై టాయిలెట్ పేపర్ చాలా మృదువైనదిగా పేర్కొంది.

ఈ టాయిలెట్ పేపర్ వాడిన వెంటనే దానిపై ఉన్న బంగారు రేణువులు మొత్తం కిందకు వస్తాయని వెల్లడించింది మ్యాన్ సంస్థ.