రోజూ పైనాపిల్ జ్యూస్ తాగండి చాలు.. ఆ సమస్యల ఊసే ఉండదు..

12 July 2025

Prudvi Battula 

వయసు కారణంగా చర్మం ముడతలు రావడం సహజం. రోజు పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారువుతుంది.

ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు కడుపు సమస్యగా అనిపిస్తే పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల తగ్గుముఖం పడతాయి.

తరచూ ఈ జ్యూస్ తీసుకుంటే చాలు ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధక వ్యవస్థ ఉన్న చురుకుగా పనిచేస్తుంది.

జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ రసాన్ని తీసుకుంటే త్వరగా ఉపశమనం కలిగిస్తుందన్నది నిపుణుల మాట.

జుట్టు రాలడం తగ్గించడంలో, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడడంలో ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేలా ఈ రసం సహాయపడుతుంది.

పళ్ళ నుంచి రక్తం కారే స్కర్వీ వ్యాధి, కడుపులో పురుగులు సమస్య ఉన్నవారు బాగా పండిన పైనాపిల్ తింటే రక్షణ కలుగుతుంది.

పైనాపిల్‌లోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని ఉపశమనం ఇస్తుంది. ఇది పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులను తగ్గిస్తుంది.