కడుపులో గ్యాస్ సమస్యా..? ఇవి బ్రహ్మాస్త్రాలుగా పని చేస్తాయి

Ravi Kiran

15 Aug 2024

మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్ల వల్ల నేడు ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ హెల్తీ డైట్ పాటించాలి.

గ్యాస్ట్రిక్ సమస్యల నుండి బయటపడటానికి కొన్ని ఆహారాలు తప్పనిసరిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. తెలియకుండా కూడా అలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. 

మరి గ్యాస్ట్రిటిస్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

బంగాళదుంపలను అందరూ ఇష్టపడతారు. కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లయితే వీలైనంత వరకు బంగాళదుంపలకు దూరంగా ఉండటం మంచిది. 

బంగాళదుంపలలో పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను అడ్డుకుంటుంది. పప్పులతో ఉడకబెట్టిన బంగాళాదుంపతో గ్యాస్ట్రిక్ పెరుగుతుంది.

ఇది త్వరగా జీర్ణం కాని కూరగాయ. దీనివల్ల అజీర్తి కలుగుతుంది. రాత్రిపూట క్యాబేజీ తినడం వల్ల కడుపు తిమ్మిరి, గ్యాస్ట్రిక్ తీవ్రతరం అవుతుంది. 

క్యాబేజి, బ్రోకలీ, కాలే వంటి కూరగాయల్లో రాఫినోస్ ఉంటుంది. దీనిని బాడీ తేలిగ్గా జీర్ణించుకోలేదు. ఈ కారణంగా ఉబ్బరం ఏర్పడుతుంది. కాబట్టి, వీటిని తినేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి.

పుచ్చకాయలో నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ జ్యుసి పండు చాలాసేపు ప్రేగులలో ఉండిపోతుంది. 

ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఇందులో షుగర్ మన్నిటాల్ ఉండటం వల్ల వాత సమస్య ఇబ్బంది పెడుతుంది.

దోసకాయలో నీరు, పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట తినడం కడుపుకు మంచిది కాదు. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. గ్యాస్ ఏర్పడుతుంది. రాత్రిపూట దోసకాయ తింటే కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది.

నిమ్మకాయలు కూడా జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదు. నిమ్మరసం కూడా తాగకూడదు.