పరగడుపున నాలుగు కరివేపాకులు తింటే ఈ సమస్యలు ఫసక్..

20 August 2023

కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.

ప్రతిరోజూ ఉదయం 3 నుంచి 4 పచ్చి ఆకులను నమిలి తింటే.. అది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కరివేపాకు ఆకులను తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. కరివేపాకులో  విటమిన్ ఎ రేచీకటీ లేదా కంటికి వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహం రోగులు రోజూ తింటే చాలా మంచిది.

కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తింటే చాలామంచిది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కరివేపాకును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి అన్ని కడుపు సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

కరివేపాకును నమిలి తినడం వల్ల బరువు, పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి.