అరటి పండును తింటున్నారా? ఆ పదార్థాలతో తింటే చాలా డేంజర్..!

TV9 Telugu

02 February 2024

అరటి పండును తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అరటిపండులో విటమిన్ సి,B6,  ఫైబర్‌, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఈ పండును తీసుకోవడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని పదార్థాలతో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

మనం  కొన్ని రకాల ఆహార పదార్థాలను పాలలో కలిపి తింటాము. కానీ అరటి పండును పాలలో కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

ఉదయం, సాయంత్రం అరటి పండు తినడం చాలా మంచిది. కానీ రాత్రి పూట అరటి పండును తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల జలుబు, మ్యూకస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి.

మధ్యాహ్న భోజనం తర్వాత చాలా మంది పండ్లను తింటారు. అయితే అరటి పండును మాత్రం తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

చాలామంది పాలు తాగాక అరటి పండును తింటుంటారు. అయితే ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు.దీని వల్ల ఆమ్లతత్త్వం తయారు అవుతుంది. 

అలాగే పరగడుపున అరటి పండు తినడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

ఈ విధంగా అరటి పండును ఈ పదార్థాలతో తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, అనారోగ్య సమ్యలు ఉన్నవారు తప్పనిసరి వైద్యుల సలహా మేరకు తినటం మంచిది.