నిలబడి తింటున్నారా.? చాలా డేంజర్‌ గురూ.. 

02 September 2023

మారుతోన్న కాలానికి అనుగుణంగా జీవన విధానం మారుతోంది. తినే ఆహారంతోపాటు విధానంలోనూ స్పష్టమైన మార్పులు వచ్చాయి. 

ఒకప్పుడు భోజనం అంటే నేలపై కూర్చొని ప్లేట్ కింద పెట్టుకొని చేసేవారు. కానీ ఇప్పుడు నిలబడి తినడం అనివార్యంగా మారింది. 

ఆఫీసులు మొదలు, పెళ్లిళ్లలో భోజనాల వరకు ఇప్పుడు నిలబడి తినడమే ట్రెండ్‌. సౌకర్యం కోసం ఈ అలవాటును చేసుకున్నారు.

అయితే సౌకర్యంగా ఉన్న ఈ అలవాటు వెనకాల ఎన్నో అనర్థాలు ఉన్నాయని మీకు తెలుసా.? నిలబడి తినడం వల్ల కలిగే దుష్ఫ్రభావాలు ఏంటంటే..

నిలబడి తినడం వల్ల ఆకలిపై స్పష్టమైన అవగాహన ఉండదు. దీనివల్ల తెలియకుండానే ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. ఇది ఊబకాయానికి దారి తీస్తుంది 

ఇక నిలబడి భోజనం చేస్తే పేగులు కుచించుకుపోతాయి. తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. 

నిలబడి ఆహారం తీసుకుంటే ఆహారం నేరుగా గొంతు నుంచి కడుపులోకి వెళ్తుంది. దీనివల్ల అన్న వాహికపై దుష్ప్రభావం చూపుతుంది. 

ఇక ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల కడుపునొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.