11 August 2023

చేపలు అతిగా తినడం వల్ల కలిగే నష్టాలు..

ఆరోగ్యానికి అత్యంత అవసరమైన విటమిన్లు అందించే రుచికరమైన ఆహారాల్లో చేపలు ఒకటి. 

ఇందులో ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లాంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. 

ఇంత మేలు చేసే చేపలు.. కొన్నిసార్లు ప్రేగు ఆరోగ్యానికి హానికరంగా మారతాయి.

చేపలను ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

చేపలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

చేపలలో చెప్పుకోదగ్గ మొత్తంలో ఫైబర్ ఉండదు. ఈ ఫైబర్ లేకపోవడం చెడు బ్యాక్టీరియా పెరుగుదలకు,  మైక్రోబయోమ్‌లో అసమతుల్యతకు దారితీస్తుంది.

కొన్ని రకాల చేపలలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు వంటి అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

చేపలు శరీరంలో వ్యాధిని నివారించడానికి,పెరుగుదలను ప్రోత్సహించడానికి యాంటీబయాటిక్స్ లా తోడ్పడతాయి.

కలుషితమైన నీటి వనరుల్లో భారీ లోహాలు, పురుగు మందులు, మైక్రోప్లాస్టిక్‌లు వంటి పర్యావరణ కలుషితాలు చాలానే ఉంటాయి.

చేపలను సురక్షితమైన వనరుల నుంచి కొనుగోలు చేయడం, వాటిని తినడానికి ముందు అవి సరిగ్గా ఉడికేలా చూసుకోవడం చాలా ముఖ్యం.