పూజిత పొన్నాడ.. ఈ అందాల భామ తెలుగు, తమిళ చలనచిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంది. షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యింది ఈ భామ.
2015లో "ఉప్మా తినేసింది" అనే లఘుచిత్రంతో నటన రంగంలోకి అడుగుపెట్టింది. 2016లో నాగార్జున, కార్తీ నటించిన "ఊపిరి" చిత్రంలో గ్యాలరీ మేనేజర్గా కనిపించింది.
2018లో "రంగస్థలం" చిత్రంలో ఆది పినిశెట్టి ప్రియురాలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
"తుంటరి", "రాజు గాడు", "హ్యాపీ వెడ్డింగ్", "బ్రాండ్ బాబు", "వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ", "రావణాసుర", "మిస్ ఇండియా", "ఓదెల రైల్వే స్టేషన్" సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నటిస్తోంది.
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటో షూట్లు మరియు గ్లామరస్ చిత్రాలను తరచూ షేర్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తుంది
పూజిత తన నటనతో పాటు సోషల్ మీడియా యాక్టివిటీతో యువతను ఆకర్షిస్తుంది.