ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాను.. వైష్ణవి చైతన్య..

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం బేబీ.

ఈ చిత్రంలో మరో హీరోగా  విరాజ్ అశ్విన్  నటిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన చిత్రం పాటలు, ట్రైలర్ సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి.

ఈ చిత్రంతో కథానాయకిగా  పరిచయం అవుతుంది యూట్యూబ్ స్టేర్ వైష్ణవి చైతన్య.

తాజాగా ఆమె మాట్లాడుతూ.. యూట్యూబర్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కొందరికి నేను తెలుసు.

కథానాయకిగా బేబీ  నా మొదటి చిత్రం. దర్శకుడు సాయి రాజేష్ గారు హీరోయిన్‌గా నాకు అవకాశాన్ని ఇచ్చారు.

ఇన్ స్టాలో రీల్స్ చేస్తే సినిమా హీరోయిన్ అయిపోతుందా.?  అంటూ నాపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

కానీ సాయి రాజేష్ గారు నాలో ధైర్యాన్ని నింపి ప్రోత్సహించారు.

ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నానని తెలిపింది ఆమె.