కళ్లు చెదిరే అందాలతో కవ్విస్తున్న తృప్తి డిమ్రి

11 August 2025

Phani Ch

ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్‏గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో ఒకేసారిగా ఫేమస్ అయ్యింది.

అందం, అభినయం, గ్లామర్ తో కట్టిపడేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది.

కానీ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

2012లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది త్రిప్తి. హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ యానిమల్ సినిమాతోనే ఈ బ్యూటీకి క్రేజ్ వచ్చింది.

దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామేతను చక్కగా ఫాలో అవుతూ ముంబయ్‌లో కాస్త గట్టిగానే ఆస్తులు కూడబెడుతోందట ఈబ్యూటీ.

యానిమల్ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్, మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ తో త్రిప్తి డిమ్రి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.