ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్గా మారిపోయింది హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమాతో ఒకేసారిగా ఫేమస్ అయ్యింది.
అందం, అభినయం, గ్లామర్ తో కట్టిపడేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చిన ఈ తార.. విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది.
కానీ యానిమల్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.
2012లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది త్రిప్తి. హిందీలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ యానిమల్ సినిమాతోనే ఈ బ్యూటీకి క్రేజ్ వచ్చింది.
దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామేతను చక్కగా ఫాలో అవుతూ ముంబయ్లో కాస్త గట్టిగానే ఆస్తులు కూడబెడుతోందట ఈబ్యూటీ.
యానిమల్ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్, మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ తో త్రిప్తి డిమ్రి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.