తెలుగులో కాయాదు చేసిన ఏకైక సినిమా ఇదే.. 

11 May 2025

Prudvi Battula 

Credit: Instagram

ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసిన ఒక్క సినిమాతో కొందరికి భారీ క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటి హీరోయిన్స్‎లో ఒకరు కాయాదు లోహర్‌.

రీసెంట్ బ్లాక్ బస్టర్ అయినా.. ప్రదీప్ రంగనాథ్ రిటర్న్ ది డ్రాగన్ మూవీలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకు మనసు దోచేసింది.

ఈ సినిమా ముందు ఈమె కొన్ని చిత్రాల్లో నటించనప్పటికి.. ఈ మూవీతో తెలుగు కుర్రాళ్లు క్రష్ లిస్టులో చేరిపోయింది.

11 ఏప్రిల్ 2000న అసోంలోని తేజ్‌పూర్‎లో జన్మించింది కాయాదు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలో నివిసిస్తోంది.

ఆమె 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో నటనా రంగ ప్రవేశం చేసింది. దీని ముందు మోడల్‎గా రాణించింది ఈ భామ.

జ్యువలరీ కాంటెస్ట్ పోటీతో తన కెరీర్‌ను ప్రారంభించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవ్రీత్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 టైటిల్ గెలుచుకుంది.

2022లో శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన క్రైమ్ డ్రామా చిత్రం అల్లూరి సినిమాతో తొలిసారి తెలుగులో కథానాయికగా కనిపించింది.

ఇదే ఆమె నటించిన ఏకైక తెలుగు సినిమా. అయితే ఇందులో ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయమే కనిపించడంతో ఫేమ్ రాలేదు.