పూజిత పొన్నాడ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ చలనచిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఆమె 1989 అక్టోబర్ 5న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జన్మించింది.B.Tech పూర్తిచేసిన పూజిత, నటనలోకి రాకముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసింది.
ఇక ఈ అమ్మడు 2015లో "ఉప్మా తినేసింది" అనే లఘుచిత్రంతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. దాంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2016లో "తుంటరి" చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి ప్రవేశించింది, కానీ ఈ చిత్రం విజయం సాధించలేదు. కానీ నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది
ఇక రంగస్థలం సినిమాలో నటించి ఆకట్టుకుంది. 2018లో వచ్చిన "రంగస్థలం" చిత్రంలో ఆది పినిశెట్టి ప్రియురాలి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
రంగస్థలం చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఊపిరి, హ్యాపీ వెడ్డింగ్, మిస్ ఇండియా, ఓదెల రైల్వే స్టేషన్ వంటి చిత్రాలలో నటించింది.
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్తో "హరిహర వీరమల్లు" చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నటించింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.