నా వాల్యూ ఎంతో నాకు బాగా తెలుసు.. 

7 August 2023

Pic credit - Instagram

ఈ యేడాది వరుసగా రెండు హిట్లుతో పాటు ‘సలార్‌’లో కూడా కథానాయకిగా కనిపించనుంది  శ్రుతిహాసన్‌.

దీంతో పారితోషికం భారీగా పెంచేయడంతో నిర్మాతలు వెనకంజ వేస్తున్నారని టాలీవుడ్‌లో ముచ్చట.

ఈ వార్తలపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది శ్రుతి హాసన్ తెలిపారు. గట్టిగా కౌంటర్ ఇచ్చింది ట్రోల్స్‌కి ఈ అందాల భామ. 

‘‘నేను సినీ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చినదాన్ని. నిర్మాతల కష్టాలు, భాదలు నాకు బాగా తెలుసు.

మా నాన్న కూడా ఓ నిర్మాతే అయినప్పుడు నేనెందుకు ఇబ్బంది పెడతాను?’’ అని ప్రశ్నించింది శ్రుతి.

‘‘డబ్బు విలువ బాగా తెలిసేలా మా అమ్మానాన్నలు పెంచారు అని శృతి హాసన్ చెప్పింది.

చేసే ప్రతి పనికీ ఓ విలువ ఉంటుంది. నా వాల్యూ ఎంతో నాకు బాగా తెలుసు. అంతకు మించి ఆశించింది ఏం లేదు.

ఓ సినిమా ఒప్పుకోవడానికీ, వద్దని చెప్పడానికీ ప్రతీసారీ పారితోషికమే కారణం కాదు.

ఒక్కోసారి పాత్ర నచ్చినప్పుడు తీసుకొనే రెమ్యునరేషన్‌ గురించి అస్సలు ఆలోచించను.

నేనే కాదు. చాలామంది కథానాయికలు ఇలానే ఉంటారు. కానీ బయట మరోలా ప్రచారం జరుగుతుంటుంది’’ అని పేర్కొంది ఆమె.