16 August 2023

నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను..:సమంత.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న చిత్రం ఖుషి.ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ , విడుదలైన ట్రైలర్ తో సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించాయి. 

లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వస్తోన్నఈ చిత్రం కోసం ఈ ఇద్దరు స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మంగళవారం ఖుషి మ్యూజికల్ నైట్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్రయూనిట్.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, సమంతతోపాటు.. మిగిలిన చిత్రబృందం కూడా పాల్గొంది. అలాగే సామ్ స్నేహితురాలు సింగర్ చిన్మయి కూడా పాల్గొన్నారు

సమంత గురించి చిన్మయి మాట్లాడుతూ “సామ్ ఎప్పటి నుంచో నీతో ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. తెలుగులో నా డబ్బింగ్ కెరీర్ మొదలైంది నీవల్లే. 

ఎంతోమందిలో నువ్వు స్పూర్తి నింపావు. ఈ ప్రపంచంలో మంచి మనసున్న, ధైర్యవంతులైన, అందమైన వ్యక్తుల్లో సమంత ఒకరు.

ఎవరు ఏం మాట్లాడినా తను ఎప్పటికీ బెస్టే” అని అన్నారు. ఆ తర్వాత అమృత సినిమాలోని ఏ దేవి వరము నీవో పాట పాడి సమంతకు డెడికేట్ చేశారు.

చిన్మయి మాటలతో ఎమోషనల్ అయిన సామ్.. వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇక ఇదే వీడియోను సామ్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ “చిన్మయి పాపా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నాపై ప్రేమను చూపించినందుకు ధన్యవాదాలు.

నీ మనసు ఎంత అందంగా ఉంటుందో అంతటి మధురమైన గాత్రాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించాడు” అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది సామ్.