సాయి పల్లవికి వింత అలవాటు.. ఎప్పుడూ అది తింటుందా?

09 August 2023

శేఖర్‌ కమ్ముల' ఫిదా' సినిమాలోని భానుమతి పాత్రతో తెలుగు వారికి బాగా దగ్గరైపోయింది సౌతిండియన్‌ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌ సాయి పల్లవి.

అంతకుముందు 'ప్రేమమ్‌' లాంటి బ్యూటిఫుల్‌ లవ్‌ స్టోరీ సినిమాతో మలయాళ ప్రేక్షకులను కట్టిపడేసిందీ అందాల తార. 

ఫిదా తర్వాత పడి పడి లేచే మనసు, నాని ఎంసీఏ, లవ్‌ స్టోరీ, శ్యామ్‌ సింగరాయ్‌, విరాట పర్వం వంటి హిట్ సినిమాల్లో నటించింది సాయి పల్లవి.

చివరిగా గార్గీ అనే లేడి ఓరియంటెడ్‌ సినిమాలో నటించిందీ సహజ నటి. ఈ సినిమా కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఈ  మూవీ 2002లో విడుదలైంది.

ప్రస్తుతం శివకార్తికేయన్‌ ఎస్‌కే21 మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. ఈ మూవీకి లోకనాయకుడు కమల్‌ హాసన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కాగా సాయి పల్లవికి వింత అలవాటు ఉందట. తాను తరచూ విభూదిని తింటానని, అది అంటే తనకు చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

తన బ్యాగులో ఎప్పుడు విభూది ఉంటుందని, అది విశేషమైన చెట్ల నుంచి తయారు చేస్తారని పేర్కొందీ లేడీ పవర్‌ స్టార్‌