అల వైకుంఠపురం చిత్రం తర్వాత మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది అందాల తార పూజా హెగ్డే.
రాదేశ్యామ్, ఆచార్య, బీస్ట్ వంటి భారీ చిత్రాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయని చెప్పాలి. బాలీవుడ్లో నటించిన సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది.
దీంతో ఈబ్యూటీకి ఇక ఆఫర్లు కష్టమని అంతా భావించిన సమయంలో తమిళంలో మంచి ఆఫర్ను కొట్టేసిందీ చిన్నది. సూర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో పూజా నటిస్తోంది.
పీరియాడిక్ డ్రాగామా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పూజా భారీ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది
సరైన విజయం లేకపోయినా పూజా ఈ చిత్రంలో తన రెమ్యునరేషన్ను ఒక్కసారిగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు బ్యూటీ ఏకంగా రూ. 4 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
అంతకు ముందు రూ. 3 కోట్ల వరకు తీసుకున్న పూజా ఒకేసారి రూ. కోటి రెమ్యునరేషన్ పెంచడం విశేషం. ఈ చిత్రంలో పూజా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం.
డేట్స్ కూడా ఎక్కువ రోజులు ఉండడంతోనే చిత్ర యూనిట్ ఈ అమ్మడు అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడిదీ హాట్ టాపిక్గా మారింది.
మరి ఈ సినిమా అయినా పూజా కెరీర్ను మళ్లీ గాడిలో పెడుతుందా.? సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్న బుట్ట బొమ్మ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా చూడాలి.