26 September 2024

మనసు కుదుటపడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే.. రష్మిక సీక్రెట్ ఇదే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి.

పుష్ప, యానిమల్ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మొత్తం భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్లో నటించడం గమనార్హం. 

ఇదిలా ఉంటే రష్మికకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. మనశ్శాంతి కోసం రష్మిక ఏం చేస్తుందంటే.. 

సాధారణంగా రష్మిక నిత్యం జిమ్ లో వర్కవుట్స్, యోగా చేస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ అభిమానులతో పంచుకుంటుంది. 

కానీ ఇవేవి కాకుండా తనకు మనసు ప్రశాంతంగా అనిపించాలంటే.. ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి ఆమె దేవాలయాలకు వెళ్తుందని చెబుతుంది రష్మిక. 

ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న పాన్ ఇండియా హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి డిమాండ్ ఎక్కువే ఉంటుంది. 

పుష్ప సినిమా తర్వాత నార్త్ అడియన్స్ లో ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత యానిమల్ మూవీతో క్రేజ్ ఒక్కసారిగా మారింది. 

ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ చిత్రంలో నటిస్తుంది. కొన్ని రోజుల క్రితమే  ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. తాజాగా రష్మిక ఆలయానికి వెళ్లింది.