బాక్సాఫీస్ క్వీన్ గా టాలీవుడ్ హీరోయిన్.. 4 సినిమాలతో 4వేల కోట్లు

28  June 2026

Basha Shek

కొన్నేళ్ల క్రితం వరకు ఈ హీరోయిన్ గురించి ఎవరికీ తెలియదు.. కానీ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఏకంగా పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది.

ఇప్పుడు బాక్సాఫీస్ క్వీన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ వందలు, వేల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి.

పెళ్లైనా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతోన్న ఈ హీరోయిన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లదేనుకుంటా? యస్.. ఈ బ్యూటీ మరెవరో కాదు రష్మిక మందన్నా

రష్మిక నటించిన పుష్ప 2 ది రూల్  ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,742 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. 

ఇక బాలీవుడ్ లో రష్మిక నటించిన యానిమల్ సినిమా కూడా గ్లోబల్ రేంజ్ లో రూ. రూ.915 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ ను శాసించింది.

ఇక హిందీలోనే చారిత్రాత్మక నేపథ్యంలో వచ్చిన ఛావా సినిమా కూడా రూ.809.91 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది

అంతకు ముందు పుష్పకు పాన్ ఇండియా క్రేజ్ తీసుకొచ్చిన పుష్ప సినిమా కూడా రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

ఇలా ఈ నాలుగు సినిమాల వసూళ్లు కలిపితే మొత్తం దాదాపు రూ. 3800 కోట్లు అవుతాయి. దేశంలో ఏ హీరోయిన్ కూ ఇలాంటి రికార్డు లేదని చెప్పుకోవచ్చు.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.