క్రేజీ లుక్స్ తో కవ్విస్తున్న బుల్లి తెర బ్యూటీ

31-jul-2023

Pic credit - Instagram

బుల్లితెర క్రేజీ యాంకర్ రష్మీ నెట్టింట ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. 

ఎప్పుడో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన రష్మీ.. నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.   

సినిమాల్లో పెద్దగా పేరు రాకపోవడంతో బుల్లితెర వైపు అడుగులు వేసింది. 

జబర్దస్త్ షోకు యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తరువాత రేంజ్ మారిపోయింది.  

ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఆన్‌స్క్రీన్‌ లవ్ ట్రాక్ బుల్లితెర అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. 

వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది అభిమానులు కోరుకుంటుండగా.. తామిద్దరం కేవలం స్నేహితులమేనని రష్మీ, సుధీర్ ఎన్నోసార్లు చెప్పారు.  

ప్రస్తుతం ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా వ్యవహరిస్తోంది. 

మెగాస్టార్ భోళా శంకర్ మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఆగస్టు 11న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.  

మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.