తల్లీదండ్రులకు క్షమాపణలు చెప్పిన ప్రియా ప్రకాశ్ వారియర్

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

ఒరు ఆడార్ లవ్ సినిమా లో కన్ను కొట్టే సన్నివేశంతో దేశ వ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

ఈ కేరళ కుట్టి తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కీలక పాత్రలో నటించింది ప్రియా.

.ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మీరు సారీ, థ్యాంక్స్‌ చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతారు? అని ప్రశ్నించగా

ప్రియా స్పందిస్తూ. థ్యాంక్యూ, సారీ రెండూ నా తల్లిదండ్రులకే చెబుతాను.

వాళ్ల ప్రోత్సహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

ఇక, టీనేజ్‌లో ఉన్నప్పుడు నేను ఎన్నో ఆకతాయి పనులు చేశాను. అమ్మ వాళ్లకు అవి నచ్చేవి కాదు.

కాబట్టి, అప్పుడు చేసిన పనులన్నింటికీ ఇప్పుడు సారీ చెబుతాను అని తెలిపింది ప్రియా.