సెగలు పుట్టిస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. ఇలా అయితే కుర్రాళ్లకు దబిడి దిబిడే!

Ravi KIran

26 May 2024

తమిళ సినిమా 'విరాట్టు'తో తెరంగేట్రం చేసిన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత హిందీలో 'టిటూ MBA' అనే మూవీ చేసింది. అయినా ఈ రెండూ ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. 

ఇక తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో అరంగేట్రం చేసింది ప్రగ్యా జైస్వాల్. కానీ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' మూవీతో ఒక్కసారిగా  తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ.

ప్రగ్యా జైస్వాల్.. మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు మోడల్‌గా పనిచేసింది.  ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఈమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కంచె మూవీ తర్వాత వరుసగా తెలుగులో 'ఓం నమో వేంకటేశాయ', గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది. కానీ సరైన బ్రేక్ అందుకోలేదు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన 'అఖండ' మూవీతో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ సినిమా సక్సెస్‌.. ప్రగ్యా జైస్వాల్‌కు మరిన్ని సినిమా ఆఫర్లు తెచ్చిపెట్టలేదు. 

ఇటీవల ఇన్‌స్టాలో లేటెస్ట్ ఫోటోషూట్స్, గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది ప్రగ్యా జైస్వాల్. ఆమె లేటెస్ట్ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.