సెప్టెంబర్ నెలలో పాన్ ఇండియా చిత్రాల సందడి..

29 August 2023

సెప్టెంబర్ నెలలో ప్రభాస్‌, రామ్‌, విజయ్‌ దేవరకొండ, రాఘవ లారెన్స్ లాంటి స్టార్స్ పాన్ ఇండియా చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

మొదటిగా సెప్టెంబర్ 1న సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటించిన శివ నిర్వాణ దర్శత్వంలో ‘ఖుషి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఖుషి

తర్వాత రెండో వారం సెప్టెంబర్ 7న అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టల  ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్ట’ చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు.

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్ట

అదేరోజు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘జావన్’ చిత్రం విడదల కానుంది. ‘పఠాన్’ మూవీ తర్వాత షారుఖ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ఇది.

జావన్

వినాయక చవితికి 3 రోజుల ముందు సెప్టెంబర్ 15న బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జోడిగా ‘స్కంద’ చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా  ఆకట్టుకోనుంది.

స్కంద

ఆ రోజునే రాఘవ లారెన్స్, కంగనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘చంద్రముఖి 2’ చవితికి ప్రేక్షకులను బయపెట్టనుంది. రజినీకాంత్ ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వల్ ఇది.

చంద్రముఖి 2

వీటితో పాటు విశాల్‌ - అధిక్‌ రవిచంద్రన్‌ కలయికలో ‘మార్క్‌ అంథోని’  కూడా సెప్టెంబర్ 15న బరిలోకి దిగనుంది.

మార్క్‌ అంథోని

చివరి వారంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ‘సలార్‌ పార్ట్‌1: సీజ్‌ ఫైర్‌’ సెప్టెంబర్ 28న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసినందుకు సిద్ధమైంది.

సలార్‌ పార్ట్‌1: సీజ్‌ ఫైర్‌