కలువలే కన్నర్ర చేయవా.. ఈ ఎర్రని మందార సోయగాన్ని చూస్తే..
Phani CH
22 March 2025
Credit: Instagram
నిఖిలా విమల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2009లో సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ‘భాగ్యదేవత’ మలయాళీ చిత్రంతో నటనా రంగంలోకి అడుగుపెట్టిన నిఖిల.
2015లో దిలీప్ నటించిన ‘లవ్ 24×7’ చిత్రంతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తరువాత, కొన్ని అద్భుతమైన పాత్రలు పోషించిన ఆ నటి, మలయాళం మరియు తమిళ భాషలలో బిజీ నటిగా మారింది.
ఈ ముద్దుగమ్మ అల్లరి నరేష్ మేడమీద అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. అల్లరి నరేష్ సినిమా తరువాత మోహన్ బాబు గాయత్రిలోనూ నటించింది.
అయితే ఈ రెండు సినిమాలు ఈ ముద్దుగుమ్మ అంత క్రేజ్ తెచ్చిపెట్టలేకపోయాయి. టాలీవుడ్ లో ఆఫర్స్ రాకపోయే సరికి సొంత గూటికి చేరిపోయింది నిఖిలా విమల్.
మల్లూవుడ్ వరుస ఆఫర్లతో.. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ డమ్ తెచ్చుకుంది. అటు తమిళంలోనూ మంచి ఆఫర్లు కొల్లగొడుతూ సక్సెస్ అందుకుంది.
ద ప్రీస్ట్, తంబి, జో అండ్ జో, పోర్ తొజిల్, గురువాయిర్ అంబలనడయిల్, నునాకుజి, వాజై చిత్రాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్.
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోస్ క్రేజీ కామెంట్స్ తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.