నాలుగేళ్లుగా ఆ సమస్యతో బాధపడుతున్నాను.. నందితా శ్వేత..

నిఖిల్‌  ‘ఎక్కడికి పోతావురా చిన్నవాడా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది నందితా శ్వేత.

ఈ చిత్రంలో దెయ్యం పాత్రలో ఆకట్టుకుంది ఈ భామ.

తర్వాత శ్రీనివాస కల్యాణం, బ్లఫ్‌ మాస్టర్, అక్షర వంటి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.

అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల అశ్విన్‌ బాబుకి జోడిగా హిడింబ చిత్రంలో నటించింది.

జులై 20న విడుదల కానున్న చిత్రంలో ఓ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది నందిత.

ఈ చిత్రం ప్రమోషన్లలో తన గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.

నాలుగేళ్లుగా ఫైబ్రోమైయాల్జియా అనే కండరాల సమస్యతో బాధపడుతున్నానని, వ్యాయామాలు చేయలేనని చెప్పింది.

అయితే మూవీ కోసం వ్యాయామాలు చేయల్సి వచ్చింది. ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోతే ఈ సమస్య మరింత పెడుతుంది.

కానీ హిడింబ మూవీ కోసం అన్నీ భరించి బరువు తగ్గానని ఆమె చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.