22 August 2023

ఆ స్టార్ హీరో తో నటించనున్న మృణాల్ ఠాకూర్

Pic credit - Instagram

సీతారామం సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఇటీవల తమన్నా, విజయ్ వర్మ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్‌-2లోనూ మెరిసింది. 

ప్రస్తుతం తమిళ స్టార్ హీరోతో ఆమె జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మావీరన్ చిత్రంతో హిట్ కొట్టిన శివ కార్తికేయన్‌కు జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.

మావీరన్ సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్‌ మరో చిత్రానికి ఓకే చెప్పేశారు.  ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ఈయన నటించనున్నారు. 

ఈ చిత్రంలో అతని సరసన బాలీవుడ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాగూర్‌ హీరోయిన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

శివ కార్తికేయన్ ప్రస్తుతం రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై కమలహాసన్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. 

ఈ  చిత్రంలో శివ కార్తికేయన్ మరోసారి పోలీస్‌ అధికారిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఇంతకుముందు కాక్కీసట్టై చిత్రంలో పోలీస్‌ అధికారిగా నటించారు. 

ఏఆర్‌.మురుగదాస్‌ చాలా గ్యాప్‌ తీసుకుని శివ కార్తికేయన్‌ హీరోగా మరోసారి పోలీస్‌ కథనే నమ్ముకుని చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. 

కాగా ఈ చిత్రాన్ని స్పైడర్‌ చిత్ర నిర్మాతలు నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్‌ సంగీతం అందించినట్లు, షూటింగ్‌ అక్టోబర్‌ లేదా నవంబర్‌ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.