13 August 2023

బోల్డ్ సీన్స్‌కు నో అంటున్న మీనాక్షి చౌదరి..

డిజిటల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ పెరిగిపోతుంది. యువత , నెటిజన్స్ ఇలాంటి వాటికి ఎక్కువ ఆసక్తి చూయిస్తున్నారు..

తాజాగా స్టార్ హీరోయిన్స్ కూడా అలంటి సీన్స్ చేస్తూ ఉండటంతో యంగ్ బ్యూటీస్ కూడా అదే బాటలో నడుస్తున్నారు.

అయితే ఈ హీరోయిన్ మాత్రం మొహమాటం లేకుండా బోల్డ్ సీన్స్ కు నో చెప్పేస్తున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ గా ఉన్న యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి..

ఆల్రెడీ రవి తేజ లాంటి సీనియర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రెజెంట్ త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.

గుంటూరు కారం తో పాటు మరో కొన్ని సినిమాల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి మూవీస్ సెలెక్షన్స్ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు.

ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ ఉన్నారు మీనాక్షి. కధ డిమాండ్ చేస్తే ముద్దు సీన్ వరకు ఓకే కానీ అంతకు మించి బోల్డ్ సీన్స్ చెయ్యను అని క్లారిటీ ఇచ్చేసారు..

ఇప్పటికే అలా బోల్డ్ సీన్స్ కు నో చెప్పడం వల్ల చాల అవకాశాలు కోల్పోయాను అని అన్నారు ఈ అమ్మడు. బోల్డ్ క్యారెక్టర్స్ నో అంటున్న ఈ బ్యూటీ ప్రయోగాత్మక చిత్రాలకు మాత్రం ఎస్ అంటుంది.

డిఫరెంట్ క్యారెక్టర్స్ చెయ్యలనే ఉద్దెశంతోనే ఇండస్ట్రీ లోకి వచ్చాను అని.. అలంటి ఆఫర్స్ వస్తే వెంటనే ఓకే చేసేస్తా అంటున్నారు.