19 August 2023

బుల్లితెరపై మహేష్ బాబు అరుదైన రికార్డ్

Pic credit - Instagram

గతంతో పోల్చి చూస్తే బుల్లితెరపై సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. యూట్యూబ్, ప్రముఖ ఓటీటీల ద్వారా సినిమాలను చూసే ఎక్కువయ్యారు

ప్రేక్షకులు బుల్లితెరపై సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే బుల్లితెరపై మహేష్ బాబు అతడు మూవీ మాత్రం రేర్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు

అయితే మహేష్ నటించిన ఈ సినిమా స్టార్ మా, మా మూవీస్ ఛానల్స్ లో ఇప్పటివరకు 2020 నాటికి 1350 కంటే ఎక్కువసార్లు ప్రదర్శితమైంది.

అతడు మూవీ ఎన్నిసార్లు టీవీలో ప్రసారమైనా ప్రేక్షకులకు బోర్ కొట్టదు. అందుకే ఈ అరుదైన రికార్డ్ సొంతమైంది. బుల్లితెరపై మరే మూవీ 1000 సార్లు కూడా ప్రసారం కాలేదు. 

అతడు సినిమా సాధించిన రికార్డును మరే సినిమా కూడా బ్రేక్ చేయలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 

అతడు సినిమాకు మాత్రమే ఈ అరుదైన ఘనత సొంతం కావడంతో మహేష్ అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా సంక్రాంతి కానుకగా రికార్డ్ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది.

మహేష్ తర్వాత ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.